Saturday, April 20, 2024

భారత్‌లో పరిస్థితుల పై డబ్ల్యూహెచ్‌ఓ ఆవేదన

భారత్‌లో కరోనా ఉద్ధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‌ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,812 మంది మృతి చెందారు. కొత్తగా 3,52,991 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో భారత్‌లో పరిస్థితి ‘హృదయ విదారక స్థితిని కూడా మించి పోయిందని ఆయన అన్నారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా సంస్థ తరఫున అదనపు సిబ్బంది, పరికరాలను పంపుతున్నామని తెలిపారు.భారత్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సాధ్యమైన సాయం చేస్తున్నామని టెడ్రోస్ తెలిపారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ప్రీఫ్యాబ్రికేటెడ్‌ మొబైల్‌ ఫీల్డ్‌ ఆసుపత్రులు, ఇతర ల్యాబ్‌ సరఫరాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. 2,600 మంది అదనపు డబ్ల్యూహెచ్‌ఓ సిబ్బందిని భారత్‌కు పంపనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement