Friday, April 26, 2024

తపస్‌ ఆధ్వర్యంలో 29న వెూడల్‌ టెట్‌..

కోస్గి, (ప్రభన్యూస్‌): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మే 29వ తేదీన మాదిరి టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) తపస్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ ఆ మల్లికార్జున గారు, కోస్గి మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీ అంజయ్య, వెంకటేష్‌ తెలియజేశారు. పేపర్‌1, పేపర్‌2 ( గణితం , సాంఘిక శాస్త్రం) రాయబోతున్న టెట్‌ అభ్యర్థులందరూ తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. వివిధ అంశాలలో ప్రత్యేకత కలిగిన నిపుణుల చేత తయారుచేయబడిన ఇలాంటి మాదిరి పరీక్షలు రాయడం వల్ల ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని టెట్‌ అభ్యర్థుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 94901 47585, 94402 04595, 94923 52296ల ఫోన్‌ నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement