Tuesday, April 16, 2024

ఉచితంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌..

క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ను అందరూ ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. ముంబయి వేదికగా బుధవారం జరగబోయే గుజరాత్‌ జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు మ్యాచ్‌ను వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అందరికీ ఉచితంగా టిక్కెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచింది బీసీసీఐ.

అయితే బుధవారం జరగబోయే మ్యాచ్‌కు మాత్రమే మహిళలతో పాటు పురుషులను కూడా టిక్కెట్టు లేకుండా మైదానంలోకి అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని మార్చి 6న ఇదే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో ఎలక్ట్రానిక్‌ బోర్డుపై తెలిపింది బీసీసీఐ.

- Advertisement -

ఆ తర్వాత ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా కూడా వెల్లడించింది క్రికెట్‌ బోర్డు. దేశంలో మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు డబ్ల్యూపీఎల్‌ (విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌) మ్యాచ్‌లన్నింటినీ మహిళలతో పాటు బాలికలందరికీ ఉచిత ప్రవేశం కల్పించింది భారత క్రికెట్‌ బోర్డు.

Advertisement

తాజా వార్తలు

Advertisement