Sunday, March 24, 2024

WPLT20: నేటి నుంచి మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్..

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ కు రంగం సిద్ధమైంది. ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇవాళ డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగే తొలి లీగ్ మ్యాచ్‌తో ఉమెన్స్‌ క్రికెట్‌లో కొత్త చరిత్ర మొదలుకానుంది. ముంబై ఇండియన్స్ vs గుజరాత్‌ గెయింట్స్‌ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ముంబై, గుజరాత్, బెంగళూరు, యూపీ వారియర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు పాల్గొననున్నాయి. ఓ ఎలిమినేటర్‌, ఫైనల్‌తో సహా లీగ్‌లో మొత్తం 22 మ్యాచులు జరగనున్నాయి. ప్రతి టీమ్‌ ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచులు ఆడనుంది. టాప్‌గా నిలిచిన టీమ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లోని రెండు టీమ్‌ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఈ లీగ్‌లో తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశాలున్నాయి. ఇక ఈ మ్యాచ్ లతో ఉమెన్స్ క్రికెట్ అభిమానులకు పండగే.

Advertisement

తాజా వార్తలు

Advertisement