Friday, April 19, 2024

చైనా,పాక్ సరిహద్దుల రక్ష‌ణ‌కు తొలిసారి మ‌హిళా లెఫ్టినెంట్స్ ..

దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులు స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ‌కు ఎంపిక చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అడకామీ లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివారం ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరారు. ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరిన మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పవిత్రా మౌద్గిల్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు మహిళా అధికారుల్లో ముగ్గురిని చైనా సరిహద్దు వెంబడి మోహరించిన యూనిట్లలో, మిగతా ఇద్దరిని పాక్‌ సరిహద్దుకు సమీపంలో ‘సవాల్‌తో కూడుకున్న ప్రదేశాల్లో’ నియమించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement