Friday, April 19, 2024

కర్నూలు జిల్లాలో మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం

సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేధిస్తున్నాడనే కారణంతో ఓ మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోనీ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో రామలక్ష్మీ అనే మహిళా హోంగార్డు విధులు నిర్వహిస్తోంది. అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ నరేష్ కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని బాధితురాలు డిమాండ్ చేసింది. అనంతరం శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం హోంగార్డు రామలక్ష్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement