Friday, April 26, 2024

పదిహేడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. అనుమానాస్పద కేసుగా నమోదు

ముఖ్యాంశాలు
• ల్యాండ్ క్రాఫ్ట్ సొసైటీ 17వ అంతస్తు నుంచి కింద పడి ఓ మహిళ మృతి.
• ఆ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో ఉంది.
• కవినగర్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఘోరం జరిగింది. ఇవ్వాల (బుధవారం) ల్యాండ్ క్రాఫ్ట్ సొసైటీలోని 17వ అంతస్తు నుంచి పడి 50 ఏళ్ల మహిళ చనిపోయింది. మృతురాలిని రంజనా సాహ్నిగా గుర్తించారు. ఆమె కుటుంబంతో కలిసి సొసైటీలోని అద్దె అపార్ట్ మెంట్‌లో నివస్తోంది. ఆమె చాలారోజుల్నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేవీనగర్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement