Friday, April 26, 2024

శ్రావణమాసంలో భర్త చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య

ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రావణమాసంలో తన భర్త చికెన్ తిన్నాడని ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. రౌదా గ్రామానికి చెందిన రామ్​ జనమ్​ సింహ్ ఆగస్టు 22న రక్షాబంధన్​ సందర్భంగా తన బంధువులతో కలిసి చికెన్​ తిన్నాడు. అయితే శ్రావణ మాసంలో చాలామంది మాంసం తినడం ఆపేస్తారు. కానీ, రామ్​ జనమ్​ చికెన్​ తినడం చూసి తన భార్య తట్టుకోలేకపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. వెంటనే ఇంట్లో ఉన్న కిరోసిన్​ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

ఈ పరిణామాన్ని ఊహించని రామ్​ జనమ్​ సింహ్.. తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే తన భార్య శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే అతడిని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అంబికాపూర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మంటలను ఆర్పే క్రమంలో తన ఎడమ చేయికి కూడా నిప్పంటుకుందని భర్త రామ్​ జనమ్​ సింహ్ తెలిపాడు.

ఈ వార్త కూడా చదవండి: సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? ఇందులో నిజమెంత?

Advertisement

తాజా వార్తలు

Advertisement