Friday, March 29, 2024

ధోనీ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ మాయం

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్‌లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీనే. మాస్‌లో ధోనీకి ఉన్న ఫాలోయింగే వేరు. ఇక సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో ధోనీ కూడా ఒకడు. ధోనీకి ట్విట్టర్‌లో 8.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

అయితే తాజాగా ధోనీ ట్విట్టర్ అకౌంట్ బ్లూటిక్ మాయమైంది. గత కొన్ని నెలలుగా ధోనీ ట్విట్టర్‌లో ఇన్‌యాక్టివ్‌గా ఉండటంతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ధోనీ చివరిగా ఈ ఏడాది జనవరి 8న ట్వీట్ చేశాడు. కాగా 2 నెలల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖాతా బ్లూటిక్‌ను కూడా ట్విట్టర్ తొలగించగా.. ఆ తర్వాత పునరుద్ధరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement