Friday, March 29, 2024

విప్రో ఉద్యోగుల వేతనాలు పెంపు.. 80 శాతం మందికి పెరిగిన జీతాలు

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో తమ ఉద్యోగుల వేతనాలు పెంచుకున్నట్లు ప్రకటించి. సంస్థలో పని చేస్తున్న దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. అసిస్టెంట్ మేనేజర్ స్థాయి, ఆ క్రిందిస్థాయి బ్యాండ్ బి 3 ఉన్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. మేనేజర్, అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఉద్యోగులు జూన్ 1 నుండి ఇప్పటికే ప్రకటించిన వేతన పెంపును అందుకుంటారని వెల్లడించింది. ఈ క్యాలండర్ ఇయర్ లో వేతనాలుపెంచడం ఇది రెండోసారి అని సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement