Thursday, April 25, 2024

ఎమ్మెల్యేల ఇంటికెళ్లి మాట్లాడతా.. మంత్రి మల్లారెడ్డి

ఇది మా పార్టీ కుటుంబ సమస్య అని..మేమే పరిష్కరించుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. అయితే దీని స్పందించిన మంత్రి మల్లారెడ్డి తానే ఎమ్మెల్యేల ఇంటికెళ్లి మాట్లాడతానన్నారు. మాది క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. తాను ఎవరితోనూ విభేదాలు పెట్టుకునే రకం కాదన్నారు. మా మధ్య అంత సమస్య లేదన్నారు. తామందరం అన్నదమ్ముల్లా ఉన్నామన్నారు. 20, 30 ఏళ్లు కలిసి ఉన్నామన్నారు. మా కుటుంబ పెద్దలు ఉన్నారు. ఏమైనా ఉంటే మాట్లాడుకుంటామన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానిస్తానన్నారు. పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement