Saturday, April 20, 2024

న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడతా : వైఎస్ భాస్కర్ రెడ్డి

ప్రభ‌ న్యూస్ బ్యూరో, కడప : వివేకా హ‌త్య కేసులో సిబిఐ విచారణ కోసం కడప కేంద్ర కారాగారంలోని సిబిఐ క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణ అధికారి లేకపోవడంలో కొద్దిసేపటికి వెనక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణ అధికారి లేని కారణంగా తిరిగి వెళుతున్నానని మీడియాతో మాట్లాడారు. మళ్లీ నోటీసులు ఇస్తామన్నారు, నోటీసు ఇచ్చాక విచారణకు వస్తానని తెలిపారు. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడతా అన్నారు. నాకు ఆరోగ్యం బాగాలేకున్నా హాజరయ్యారని తెలిపారు. నేను మాట్లాడేందుకు ఏమీ లేదు, అంతా ఎంపీ వైఎస్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారని మాట్లాడుతూనే వివేకా కేసులో సూసైడ్ లెటర్ గా చెపుతున్న లెటర్ ఎందుకు వెలుగులోకి రాలేదని ప్రశ్నించారు. ఆ లెటర్ ఎందుకు బయటకు రాలేదో అర్థం కావడం లేదని మాట్లాడారు. సిబిఐ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వైఎస్ భాస్క‌ర్ అన్నారు.

కొద్ది సేపు ఉత్కంఠ
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆదివారం ఉదయం సిబిఐ విచారణ కోసం హాజరు కానుడడం కొంత ఉత్కంఠ రేపింది. విచారణ సందర్భంగా ఆయన్ను అరెస్టు చేయవచ్చని గత నాలుగు రోజులుగా ప్రచారం సాగుతోంది. సిబిఐ కూడా మూడు రోజుల క్రితం వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేసేందుకు తగిన అనుమానాలు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో శనివారం విచారణ సందర్భంగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు సాగడంతో పులివెందులతో పాటు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ రేగింది. శనివారం ఉదయమే పులివెందుల నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి భారీ కాన్వాయ్ తో కడప సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. సెంట్రల్ జైలు వద్ద కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో గుమి కూడారు. అయితే విచారణ అధికారి లేకపోవడంతో ఆయన వెనుక దిరిగి వెళ్ళిపోవడంతో ఉత్కంఠకు తెరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement