Friday, April 19, 2024

భర్తకు గుడికట్టి పూజిస్తున్న భార్య

పతియే ప్రత్యక్ష దైవం అని అన్నారు పెద్దలు. అయితే ఓ మహిళ తన భర్త మరణానంతరం కూడా పూజిస్తూ ఈ జీవితం ఆయనకు అంకితం అంటూ చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతి కి 21 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

దురదృష్టవశాత్తు నాలుగేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో అంకిరెడ్డి మృతి చెందారు. అయితే భర్త మరణానంతరం ఆయనకు ఓ గుడికట్టింది పద్మావతి. నిత్యం పూజలు చేస్తోంది. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా చేస్తోంది. ప్రతి పౌర్ణమికి అంకిరెడ్డి పేరుమీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పతి భక్తి చాటుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement