Thursday, March 28, 2024

భార్యా ,భ‌ర్త‌ల ప్రాణాల‌ను బ‌లిగొన్న క్ష‌ణికావేశం

క్ష‌ణికావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు వారి ప్రాణాల‌నే తీస్తున్నాయి. దాంతో కుటుంబాలు చిన్నాభిన్న‌మ‌వుతున్నాయి. కాగా భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య క‌ల‌హాలు వారి ప్రాణాల‌నే బ‌లిగొన్నాయి. ఈ సంఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం శ్రీహ‌రిపురం గొల్ల‌పాలెంలో చోటు చేసుకుంది. . మాధ‌వి, శివ‌నాగేశ్వ‌ర‌రావు దంప‌తుల మ‌ధ్య‌గొడ‌వ తీవ్రం కావ‌డంతో కోపంతో నాగేశ్వ‌ర‌రావు భార్య మాధ‌విపై డంబెల్ తో కొట్ట‌గా ఆమె అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. భార్య మృతితో తీవ్ర భయాందోళనకు గురయిన నాగేశ్వరరావు తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా భార్యాభర్తలు ఇంట్లోనే శవాలుగా మారారు.దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్ కు తరలించారు. నాగేశ్వరరావు భార్య హత్యకు ఉపయోగించిన డంబెల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement