Tuesday, April 23, 2024

చిత్తూరు జిల్లాలో దారుణం.. భర్తను మర్మాంగంపై కొట్టి చంపిన భార్య

చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భర్త రోజూ మద్యం సేవించి వస్తూ వేధింపులకు గురిచేస్తుండటంతో అతడి భార్య తట్టుకోలేకపోయింది. దీంతో మద్యం మత్తులో ఉన్న భర్త కేశవను హతమార్చింది. అయితే తన భర్త మద్యం మత్తులో ఇంటి మేడపై నుంచి జారిపడినట్లు ఇంటి పక్క వారికి, పోలీసులను ఆమె నమ్మించింది. ఈ ఘటన మే 29న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా తన కుమారుడు మృతిపై తనకు అనుమానం ఉందని మృతుడు కేశవ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. పోలీసులు కేశ‌వ భార్య‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు నిజం భ‌య‌ట‌పెట్టేసింది. త‌న భర్త ప్ర‌తి రోజూ మ‌ద్యం సేవించి వ‌చ్చి వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని అందుకే మ‌ర్మాంగంపై కొట్టి చంపాన‌ని నిజం ఒప్పుకుంది. దీంతో నిందితురాలిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అరెస్ట్ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: షట్టర్‌లో చిక్కుకుని బాలుడు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement