Friday, March 29, 2024

భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసిన భార్య

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఒక దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో భ‌ర్త‌ను అతడి భార్య దారుణంగా చంపి అత‌ని మ‌ర్మాంగం కోసేసింది. భార్యాభర్తల మధ్య గొడ‌వ‌లు రావ‌డం స‌హ‌జం కానీ అందులో ఏ ఒక్క‌రి ఓపిక న‌శించినా అప్పుడు చోటు చేసుకునే ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, అందుకు ఈ సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధి వాంకుడోతు తండాలో భూక్య బీచ్యా – ప్రమీల భార్య భ‌ర్త‌లు నివ‌సిస్తుండేవారు. తాజాగా భార్యాభ‌ర్త‌లు ఇద్దరూ గొడ‌వ ప‌డ్డారు, ఆ ఇంటి నుండి పెద్ద పెద్ద అరుపులు విన‌ప‌డ్డాయి. ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను దారుణంగా చంప‌డ‌మే కాకుండా అత‌ని ప్రైవేట్ పార్ట్ (మ‌ర్మాంగం ) కోసి చంపేసింది. భర్త ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో భార్య ప్రమీల మర్మాంగం కోసిందని స్థానికులు అంటున్నారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement