Thursday, March 28, 2024

భార్యతో బలవంతంగా యాసిడ్ తాగించిన భర్త

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో దారుణం జ‌రిగింది. భార్య‌తో ఓ భర్త బ‌ల‌వంతంగా యాసిడ్ తాగించ‌డంతో అంత‌ర్గ‌త అవ‌యవాలు దెబ్బ‌తిన‌గా చికిత్స నిమిత్తం ఆమెను ఢిల్లీ త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని ఇప్ప‌టివ‌ర‌కూ అరెస్ట్ చేయ‌లేద‌ని ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ స్వాతి మ‌లివాల్ ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు కాగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను స‌బ్ డివిజ‌న‌ల్ మేజిస్ట్రేట్ ఎదుట న‌మోదు చేశార‌ని ఆమె పేర్కొన్నారు. నిందితుడిని స‌త్వ‌ర‌మే అరెస్ట్ చేసేలా చొర‌వ చూపాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ చౌహాన్‌కు స్వాతి మ‌లివాల్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇక యూపీలో వెలుగుచూసిన మ‌రో ఘ‌ట‌న‌లో త‌న కోరికను తీర్చేందుకు నిరాక‌రించిన భార్య అక్క‌పై నిందితుడు యాసిడ్ పోశాడు.

ఈ వార్త కూడా చదవండి: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి అవకాశం

Advertisement

తాజా వార్తలు

Advertisement