Thursday, April 25, 2024

వరంగల్: సెల్ఫీ వీడియో తీసుకుని దంపతుల ఆత్మహత్య

వరంగల్ జిల్లా పరకాలలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తలు సంధ్య, స్వామిగౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన ఈ దంపతులు ప్రార్థనల కోసం పరకాలలోని ఓ చర్చికి వచ్చినట్లు తెలిసింది. చర్చి సమీపంలో భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగారు. వీరిలో సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందగా స్వామి గౌడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు.

అయితే వీరు ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దంపతుల వీడియో చూస్తే కుటుంబ కలహాల ద్వారానే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు చెప్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: కొత్త లుక్‌లో అదరగొడుతున్న MSD

Advertisement

తాజా వార్తలు

Advertisement