Saturday, April 20, 2024

నా హెలికాప్ట‌ర్ టేకాఫ్ కు ఎందుకు అనుమ‌తించ‌లేదు : ట్విట్ట‌ర్ లో అఖిలేశ్ యాద‌వ్

స‌మాజ్ వాదీ పార్టీ అధ్య‌క్షులు అఖిలేశ్ యాద‌వ్ బీజేపీపై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ కు హెలికాప్ట‌ర్ లో వెళ్లేందుకు సిద్ద‌మైతే త‌న హెలికాప్ట‌ర్ టేకాఫ్ కు అనుమ‌తించలేద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అఖిలేశ్ యాద‌వ్ మండిప‌డ్డారు. ఇది బీజేపీ ఓటమి కుట్రగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు హెలికాప్టర్ లో వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్ సిద్ధమయ్యారు. కానీ తన హెలికాప్టర్ టేకాఫ్ కు అనుమతించలేదని ఆరోపించారు. బీజేపీకి చెందిన ఓ నాయకుడికి అదే విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎంత చేసినా.. 2022 లో జరిగే ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించడం ఖాయమని అఖిలేశ్ యాద‌వ్ ధీమా వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement