Tuesday, March 19, 2024

ప్రాణాలతో లేని వ్యక్తి.. ఎంపీటీసీ అయ్యాడు

విశాఖ జిల్లాలో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఆయన ప్రస్తుతం ప్రాణాలతో లేడు. ఆదివారం నాడు విశాఖ జిల్లాలో పరిషత్ ఓట్ల లెక్కింపు సందర్భంగా నాగులపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి నాగ సన్యాసిరావు విజయం సాధించారు. ఎంపీటీసీగా 775 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే నాగ సన్యాసిరావు ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నాళ్ల కిందట పరిషత్ ఎన్నికల పోలింగ్ జరగ్గా, కోర్టు తాజా ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఇప్పుడు చేపట్టారు. కానీ తన ఫలితాన్ని చూసుకోవడానికి నాగ సన్యాసిరావు ఇప్పుడు లేరు. ఆయన గెలుపు నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరింత బాధకు లోనయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement