Tuesday, March 26, 2024

జగన్ అరాచక పాలనలో ఎవరికీ భద్రత లేదు : నాదెండ్ల మనోహ‌ర్

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని, ఎవ‌రీకి భ‌ద్ర‌త లేద‌ని జ‌న‌సేన‌ పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహ‌ర్ అన్నారు. జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. శుక్ర‌వారం జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించారు. గంగమ్మ కుమారుడు ‌సెప్టిక్ ట్యాంకులో పడి ప్రాణాలు కోల్పోయాడని.. మంత్రి అంబటి రాంబాబు బయటకు రాకుండా పంచాయతీ చేశారని ఆరోపించారు. సీఎం సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని వివాదం‌ కాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. రూ.5 లక్షలు మంజూరైతే.. అందులో సగం తమకు ఇవ్వాలని అంబటి హెచ్చరించాడని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement