Friday, April 19, 2024

లాక్ డౌన్ పెట్టకపోతే తీవ్ర నష్టం భారత్ ను హెచ్చిరించిన వైట్ హౌస్ డాక్టర్…

 భారత్ లో ప్రస్తుత కరోనా పరిస్థితులపై అమెరికా వైట్‌ హౌజ్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డా. ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో వెంటనే 3-4 వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ సంక్రమణను బ్రేక్ చేయడానికి లాక్‌డౌన్ తప్పదన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని, లాక్‌డౌన్‌ కారణంగా కలిగే ఆర్థిక నష్టం కంటే పెట్టకపోతే వచ్చే నష్టం ఇంకా పెద్దదన్నారు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులు, వేల సంఖ్యలో మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక హాస్పిటల్స్‌, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలని తెలిపారు. ఎక్కువ కంపెనీల్లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్నారు. కష్టకాలంలో ఇతర దేశాలకు భారత్‌ అండగా నిలిచిందని, ప్రస్తుతం భారత్‌కు ప్రపంచదేశాలు మద్దతుగా నిలవాలని.. వైద్య పరికరాలు అందించడమే కాదు.. వైద్య సిబ్బందిని పంపాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement