Thursday, April 25, 2024

ఏపీలో వైట్ ఫంగస్ కలకలం

కర్నూలు జిల్లాలో వైట్ ఫంగస్ కలకలం రేపుతోంది. వెలుగోడు మండలం గుంతకందాలలో షేక్ జొల్లు బాషాకు వైట్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే బాధితుడిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. స్థానికంగా వైట్ ఫంగస్‌ లక్షణాలు బయటపడటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కాగా బ్లాక్, వైట్ ఫంగస్‌ల నేపథ్యంలో వాటికి సంబంధించి ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్ర‌య‌త్నాలు చేయాల‌ని అధికారుల‌ను సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌, బ్లాక్‌ఫంగస్ బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపైన సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1179 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయని, ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 14 మంది మరణించారని, కోవిడ్‌ లేకున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిన వారిలో 1139 మంది కోవిడ్‌ సోకినవారు కాగా, 40 మందికి కోవిడ్‌ రాకపోయినా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిందన్నారు. డయాబెటిస్‌ ఉన్నవారికి అధికంగా వస్తోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement