Wednesday, April 24, 2024

భారత్ లో 20 లక్షల ఖాతాలు తొలగింపు

నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా వాట్సాప్ కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు భారత్ లో 20 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లు ప్రకటించింది. విపరీతమైన ప్రవర్తనలతో కూడిన తన ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని వాట్సప్ పేర్కొంది. మే 15 నుంచి జూన్ 15 మధ్యన ఈ ఖాతాలను నిలిపివేసినట్టు తెలిపింది. ఇలాంటి ఖాతాలను ముందే గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, హాని జరిగాక స్పందించడం కంటే, ముందే చర్యలు తీసుకోవడం సబబు అని భావిస్తున్నట్టు తన నివేదికలో తెలిపింది. అవాంఛనీయ ఖాతాలను గుర్తించేందుకు అనువైన సాధనాలను ఏర్పాటు చేశామని వాట్సాప్ వెల్లడించింది. ఇలాంటి ఖాతాలను గుర్తించే ప్రక్రియ మూడు దశలు కలిగి ఉంటుందని, రిజిస్ట్రేషన్, సందేశాలు పంపే సమయం, ఫిర్యాదులు ఆధారంగా స్పందిస్తామని వివరించింది.

ఇది కూడా చదవండి: కెనాల్‌లో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం

Advertisement

తాజా వార్తలు

Advertisement