Friday, March 29, 2024

ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ముగ్గురూ చెరువులో దూకేశారు..!

అనంతపురం : బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువులో మూడు మృతదేహాలు లభ్య‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను వెలికి తీశారు. మృతులు అనంతపురం నగరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన ఉండ‌వ‌చ్చు అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 28న భార్యతో గొడవపడి మహమ్మద్ రఫీ(35), కుమారులు ఇమ్రాన్(9), సోహైల్ (6) ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ రోజు బుక్కరాయ సముద్రం చెరువులో శ‌వాలుగా తేలారు. మహమ్మద్ రఫీ బేల్దారి పనిచేసుకంటూ జీవనం సాగించేవాడ‌ని తెలుస్తోంది. అనంతపురం త్రీ టౌన్ పోలీసులు మిస్సింగ్ గా కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement