Friday, March 29, 2024

మేనేజ్‌మెంట్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు 24న వెబ్‌ కౌన్సిలింగ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు ఈనెల 24న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం అదనపు మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. మాప్‌ అప్‌ విడత కౌన్సెలింగ్‌ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు యూనివర్సటీ వర్గాలు తెలిపాయి. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చామని అధికారులు తెలిపారు.

ఈనెల 24న ఉదయం 6 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు అర్హులని చెప్పారు. క్రితం కౌన్సెలింగ్‌లో సీట్‌ పొంది కూడా చేరని, చేరినా మధ్యలో కోర్సు వదిలేసిన, ఆల్‌ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement