Friday, April 19, 2024

ఈ అద్భుతాల‌ను దేశ‌వ్యాప్తంగా అందిస్తాం .. మంత్రి త‌ల‌సాని

ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ తోనే తెలంగాణ అభివృద్ది చెందిందని, ఈ అద్భుతాలను దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా జియాగూడ రంగనాథ స్వామి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలకు అద్భుతాలు అందించే అందుకే బిఆర్ఎస్ ఏర్పాటు అయిందని, వివిధ రాష్ట్రాల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ తోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఈ అద్భుతాలను దేశవ్యాప్తంగా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement