Friday, March 15, 2024

అసంపూర్తిగా వ‌దిలేసిన రోడ్ల‌ను.. అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాం : నారా లోకేష్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు కొన‌సాగుతుంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ పాద‌యాత్ర‌గా ముందుకు సాగుతున్నారు లోకేష్‌. పాదయాత్రలో నారా లోకేష్ ను బాబు నగర్ స్థానికులు క‌లిశారు. గ్రామానికి రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం అని, టీడీపీ హయాంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించారు, సగం పూర్తి అయ్యే సరికి ప్రభుత్వం మారింద‌న్నారు. అప్పటి నుండి ప్రభుత్వం రోడ్డు పూర్తి చెయ్యలేద‌ని, ఎక్కడికి వెళ్ళాలి అన్నా అవస్థలు పడుతున్నాం అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా అధికారం వచ్చిన 100 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం అని లోకేష్ గ్రామ‌స్తుల‌కు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement