Saturday, April 20, 2024

మా శాఖల్లోనూ అగ్నివీరులను నియమిస్తాం.. కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి

పెట్రోలియం, గృహనిర్మాణ శాఖల పరిథిలోని ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా అగ్నివీరులను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి శనివారం ప్రకటించారు. అయితే అగ్నివీరుల నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన తరువాత వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.

అగ్నిపథ్‌ పథకం ఎంతో అద్బుతమైన కార్యక్రమమని, అయితే విపక్షాలు తప్పుడు సమాచారం ఇచ్చి యువతను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ఒక వార్తాసంస్థకు సంబంధించిన కార్యక్రమంలో హర్‌దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ అగ్నివీరులు సుశిక్షితులని, వారి సేవలతో ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement