Friday, April 26, 2024

విండీస్‌తో టీ20 సిరీస్‌.. మ్యాచ్ కు వాషింగ్టన్‌ సుందర్‌ దూరం..

రేపటి నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ దూరమవనున్నాడు. సుందర్‌ ఎడమ తొడకండరాలు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. సుందర్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందనున్నట్లు తెలిపారు. ఆల్‌రౌండర్‌ అక్షర్‌పటేల్‌ కూడా విండీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. సుందర్‌ వెస్టిండీస్‌తో జరగనున్న పొట్టి సిరీస్‌కు దూరమవడంతో అతడి స్థానంలో కుల్దిప్‌యాదవ్‌ జట్టులో చేరనున్నాడు. ఆల్‌రౌండర్‌ సుందర్‌ వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో గాయపడ్డాడు.

కాగా రేప‌టి నుంచి (బుధవారం) కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా ఇంగ్లండ్‌ టూర్‌లో గాయపడిన వాషింగ్టన్‌ సుందర్‌ కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. అనంతరం విజయ్‌హజారే ట్రోఫీలో సత్తా చాటి మళ్లి జట్టులో చోటు దక్కించుకున్నాడు. కరోనా పాజిటివ్‌ రావడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా సుందర్‌ దూరమైన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement