Thursday, April 25, 2024

రాజు డెడ్‌బాడీని వరంగల్ ఎంజీఎంకు తరలిస్తాం: సీపీ

హైద‌రాబాద్‌లోని సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీకి చెందిన చిన్నారి హ‌త్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రాంతానికి వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్ జోషి ప‌రిశీలించారు. పంచ‌నామా అనంత‌రం వ‌రంగ‌ల్ ఎంజీఎంకు రాజు డెడ్‌బాడీని త‌ర‌లిస్తామ‌న్నారు. అక్క‌డ పోస్టుమార్టం నిర్వ‌హించిన అనంత‌రం మృత‌దేహాన్ని అత‌న్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తామ‌న్నారు. గురువారం ఉద‌యం 9:58 గంట‌ల‌కు గ్యాంగ్ మెన్ సారంగ‌పాణి 100కు డ‌య‌ల్ చేశారు.

రాజారాం బ్రిడ్జి వ‌ద్ద రైలు కింద ప‌డి ఎవ‌రో ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెలుప‌డంతో.. ఎస్సై ర‌మేష్ బృందం అక్క‌డికి చేరుకున్నారు. డెడ్‌బాడీపై ఉన్న ప‌చ్చ‌బొట్టు, ధ‌రించిన దుస్తుల‌ను బ‌ట్టి రాజుగా నిర్ధారించారు అని సీపీ పేర్కొన్నారు. హైద‌రాబాద్ నుంచి స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు ఎలా వ‌చ్చాడో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ మార్గానికి వ‌చ్చే సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తామ‌ని సీపీ త‌రుణ్ జోషి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement