Saturday, April 20, 2024

మాస్ యాక్షన్ మూవీగా వాల్తేరు వీరయ్య.. ప్రధాన ఆకర్షణగా ఫోర్ట్ సెట్

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ద‌ర్శ‌కుడు బాబీ రూపొందిస్తున్నాడు.ఈ చిత్రం సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ. అందువలన ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్ చేత ఫోర్ట్ సెట్ ను వేయించారు. ఈ సెట్ కోసం రెండు నెలల పాటు 300 మంది నుంచి 400 మంది వరకూ రెగ్యులర్ గా పనిచేశారు. ఈ సినిమాలోని ఒక పాట కోసం వేసిన ఈ సెట్, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంద‌ని చెప్పారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవి సినిమాకి వర్క్ చేయాలనేది నా డ్రీమ్. ఆ ముచ్చట ఈ సినిమాతో తీరింది. కథ వింటున్నప్పుడే సెట్ ఎలా ఉండాలనే ఒక విషయంలో నాకు క్లారిటీ వచ్చేసింది అని అన్నారు. “ఫోర్ట్ సెట్ కి అయ్యే ఖర్చు నిర్మాతలకు అందుబాటులో ఉండాలి. అలాగే చిరంజీవిగారి క్రేజ్ కి తగినట్టుగా ఉండాలి. బడ్జెట్ పరిధి దాటకూడదు .. భారీతనం తగ్గకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సెట్ వేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement