Thursday, March 28, 2024

రేపు హ‌నుమ‌కొండ‌లో.. వాల్తేరు వీర‌య్య స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్

రేపు హనుమకొండలో వాల్తేరు వీర‌య్య సక్సెస్ సెలబ్రేషన్స్ జ‌ర‌గ‌నున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. రేపు జరగనున్న ఈ వేడుకలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొంటూ ఉండటం విశేషం. బాబీ దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీర‌య్య. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, 10 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను శ‌నివారం హనుమకొండలో నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది.
ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా .. ప్రతినాయకుడిగా ప్రకాశ్ రాజ్ కనిపించారు. కీలకమైన పాత్రను రవితేజ పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement