Thursday, April 25, 2024

డ్యాన్స్ తో అద‌ర‌గొట్టిన దేవీశ్రీ..బాబీ.. శేఖ‌ర్ మాస్ట‌ర్

వాల్తేరు వీర‌య్య చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి..హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. కాగా ఈ మూవీని బాబీ (కేఎస్ రవీంద్ర) తెర‌కెక్కిస్తున్నాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. రవితేజ కీలక పాత్ర పోషించాడు. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మెగాస్టార్ పోస్టర్లతో పాటు పలు పాటలతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించిన చిత్రం బృందం ఈ మధ్యే డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ పాటను వదిలింది. ఈ క్రమంలో సెట్ లో పూనకాలు లోడింగ్ పాటకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో పాటు దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్టెప్పులు వేసిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో శేఖర్ మాస్టర్ కు పోటీగా బాబీ, డీఎస్పీ.. సిగ్నేచర్ స్టెప్పు వేసి అలరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement