Tuesday, March 26, 2024

మూడు రోజుల‌లో రూ.108 కోట్లు కొల్ల‌గొట్టిన వాల్తేరు వీర‌య్య‌..

సంక్రాంతి కానుకగా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య మూడురోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించించారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య మెగా మాస్ బ్లాక్ బస్టర్ అని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తొలి మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ రాబట్టి మెగాస్టార్ బాక్సాఫీస్ బాస్ అయ్యారని తెలిపారు. ఏనుగుపై కూర్చొని ఉన్న చిరంజీవి కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా రిలీజైన మొదటి రోజు రూ.55 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించిన మెగాస్టార్‌ సినిమా రెండో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ .75.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీ్‌లోనూ రికార్డులు కొల్లగొడుతోంది వాల్తేరు వీరయ్య. ఇప్పటివరకు అమెరికాలో1.6 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్స్‌ను రాబట్టింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ ర‌వితేజ ఓ కీలక పాత్ర పోషించాడు. శృతిహాసన్‌ హీరోయిన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement