Tuesday, April 23, 2024

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విష్ణువర్ధన్ రెడ్డి సూటి ప్రశ్న

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ కెసిఆర్ లు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని… తెలంగాణ లోకి వెళ్లేందుకు అంబులెన్సులను ఇప్పటికీ పోలీసులు అనుమతించడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై కోర్టు చెప్పినా స్పందించరా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా ను మించిన ముఖ్యమైన సమస్య ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు.

సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయని వెంటనే ఆ సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు సరైన సమయంలో రెండు రాష్ట్రాల ప్రజలు బుద్ధి చెబుతారని రెండు రోజులుగా సమస్య తీవ్రంగా ఉన్న ఈ విషయం పై అధికారిక ప్రకటన చేయడం లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement