Saturday, April 20, 2024

స్టీల్‌ప్లాంట్ కార్మికులకు మద్దతుగా టీడీపీ పాదయాత్ర

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల చేపట్టిన ఉద్యమానికి టీడీపీ నేతలు మద్దతిచ్చారు. ఈ మేరకు టీడీపీ కార్పొరేటర్లు ఈ ఉదయం విశాఖ నగరంలో పాదయాత్ర నిర్వహించారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కార్పొరేటర్లు కాగడాలతో పాదయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి నగరపాలక సంస్థ వరకు పాదయాత్రగా చేరుకున్నారు. టీడీపీ కార్పొరేటర్లు చేపట్టిన ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని, లేదంటే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement