Saturday, April 20, 2024

ముంబయి వీధుల్లో విరుష్క.. వైర‌ల్ గా వీడియో !

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అతనిభార్య అనుష్క శర్మ ముంబయి వీధుల్లో కనిపించారు. మామూలుగా సెలబ్రెటెస్‌ అంటేనే లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు. కానీ ఈ కపుల్‌ మాత్రం కాస్త కొత్తగా ఆలోచించారు. స్కూటీపై రైడ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో కోహ్లి స్కూటీ నడుపుతుండగా.. వెనుక అనుష్క కూర్చుంది. వీరిద్దరూ హెల్మెట్లు పెట్టుకున్నప్పటికీ ఫ్యాన్స్‌ మాత్రం వీరిని గుర్తుపట్టేశారు.

వెంటనే తమ అభిమాన క్రికెటర్‌ ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఎప్పుడూ క్రికెట్‌, ఫోటో షూట్స్‌, యాడ్స్‌తో కెరీర్‌ లో బిజీగా ఉండే జంట ముంబైలోని మధ్‌ ఐలాండ్‌లో స్కూటీపై తిరుగుతూ కనిపించారు. ఇద్దరూ నల్లటి హెల్మెట్‌ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డప్పటికీ జనాలు వారిని గుర్తు పట్టేశారు. కాగా ఇటీవలె టీమిండియా ఆటగాళ్లు లండన్‌ నుంచి కరేబియన్‌ దీవులకు వెళ్లగా.. కోహ్లి, అనుష్క శర్మ అక్కడే కొద్ది రోజులు గడిపి ఇటీవలె ఇండియాకు తిరిగొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement