Thursday, April 25, 2024

బెజవాడ దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు

ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండడంతో బెజవాడ దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. విజయవాడ నగరంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.

ఆలయ ఉద్యోగులు, అర్చకులు మాస్కు ధరించకుంటే రూ. 200 జరిమానా విధించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దుర్గగుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, దేవస్థానం వైదిక కమిటీ సభ్యులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు భ్రమరాంబ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement