Saturday, April 20, 2024

అమిత్ షా తో విజయసాయి రెడ్డి భేటీ.. రాష్ట్రాభివృద్ధితో పాటు రాజకీయాంశాలపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమిత్ షాతో కలిసిన ఫొటోను పోస్టు చేసిన ఆయన, రాష్ట్రాభివృద్ధి అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నారు. కీలక సమయంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్రాభివృద్ధి అంశాలతో పాటు రాజకీయాలపై కూడా చర్చలు జరిగినట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement