Tuesday, March 26, 2024

‘విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌’కు 12ల‌క్ష‌ల మంది..పార్కింగ్ కు 1500ఎక‌రాలు..

వరంగల్ లో నిర్వహించే విజయగర్జన సభకు 12 లక్షల మంది హాజరవుతారని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు వెల్ల‌డించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. పార్కింగ్ కోసం 1500 ఎకరాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. సభాప్రాంగణం వద్ద మరో 100 ఎకరాలను సేకరిస్తున్నామని అన్నారు. సభ కోసం స్థలాలను ఇచ్చిన దేవన్నపేట, కోమటిపల్లి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.సీఎం కేసీఆర్ రేపు వరంగల్ కు వస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. హనుమకొండలోని జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని… పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న మహా ధర్నాను అన్ని నియోజకవర్గ కేంద్రాలలో విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement