Friday, March 29, 2024

అనారోగ్యం నుంచి కోలుకున్న సైరాభాను.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ప్రముఖ సీనియర్ నటి సైరా భాను ముంబైలోని హిందుజా ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 28న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు హై బీపీ, హై షుగర్ వంటి సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరారు. సైరా భాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని వారి కుటుంబ స్నేహితుడు ఫైసల్ ఫరూఖీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సైరా బాను ఇంటికి వచ్చేశారని… ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని చెప్పారు.

ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత సైరా భానును వైద్యులు ఐసీయూకి తరలించారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ సతీమణే సైరా భాను అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది జులైలో 98 ఏళ్ల వయసులో దిలీప్ కుమార్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement