Thursday, April 25, 2024

వెలాసిటీదే విజయం, సూపర్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు.. హర్మన్‌ప్రీత్‌ అర్ధ సెంచరీ వృథా..

మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం వెలాసిటీ, సూపర్‌నోవాస్‌ జట్లు తలపడ్డాయి. దీప్తి శర్మ నాయకత్వం వహిస్తున్న వెలాసిటీ 7 వికెట్ల తేడాతో సూపర్‌ నోవాస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ నోవాస్‌ నిర్ణిత 20 ఓవర్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియా (4), డొట్టిన్‌ (6) ఘోరంగా విఫలం అయ్యారు. డియోల్‌ (7) వద్ద ఔటవ్వగా.. తానియా భాటియా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లు జట్టును ముందుకు తీసుకెళ్లారు. తానియా (36), కౌర్‌ (71) పరుగులతో మెరిశారు. సునే (20), వస్త్రకర్‌ (2)నాటౌట్‌గా నిలిచారు. క్రాస్‌కు 2 వికెట్లు, దీప్తి శర్మ, రాధాకు ఒక్కో వికెట్‌ దక్కింది.

దక్కని శుభారంభం..

151 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన వెలాసిటీ జట్టుకు శుభారంభం దక్కలేదు. చంథమ్‌ (1) ఔటవ్వగా.. షఫాలీ వర్మ (51)తో రాణించింది. యాత్సికా (17) చేయగా.. లౌరా (51), దీప్తి శర్మ (24) నాటౌట్గా నిలిచారు. ఇద్దరూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 18.2 ఓవర్స్‌లోనే 151 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. డొట్టిన్‌కు 2 వికెట్లు, పూజ వస్త్రకర్‌కు ఒక వికెట్‌ దక్కింది. చివరికి వెలాసిటీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement