Saturday, April 20, 2024

వీరాసింహారెడ్డి నుండి మాస్ ఆంథెమ్.. థ‌మ‌న్ మ‌రోసారి అద‌ర‌గొట్టాడుగా

అఖండ చిత్రం త‌ర్వాత హీరో బాల‌కృష్ణ న‌టిస్తోన్న తాజా చిత్రం వీర‌సింహారెడ్డి. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కన్నడ యాక్టర్‌ ధునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తుండగా.. కేజీఎఫ్ అవినాష్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నాడు. .మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్ జై బాలయ్య మాస్ ఆంథెమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. కరీముల్లా పాడారు.

రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన ఈ పాటలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్‌, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలకృష్ణలా మారిపోయి డ్యాన్స్ చేస్తుండటం చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. కాగా బాలకృష్ణ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్‌ పెట్టుకుని అభిమానులకు కావాల్సిన విజువల్‌ ట్రీట్‌ అందిస్తూ..సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఎస్‌ థ‌మన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్‌తో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా సాంగ్‌తో అర్థమవుతుంది. రాయ‌లసీమ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగిన వాస్తవ అంశాల నేప‌థ్యంలోపక్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement