Friday, March 29, 2024

అక్కినేని హీరో కోసం మెగా హీరో త్యాగం

అక్టోబర్ 8న టాలీవుడ్‌లో రెండు మీడియం రేంజ్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో ఒక మూవీ మెగా హీరోది కాగా రెండోది అక్కినేని హీరోది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమాలు అక్టోబర్ 8న విడుదలవుతున్నట్లు గతంలో ప్రకటించారు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తోంది. వాసు వర్మ, బన్నీవాసు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పుడు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కోసం కొండపొలం మూవీని వాయిదా వేశారు. ఉప్పెన సినిమాతో ఈ ఏడాది అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలం. ఈ మూవీని నవంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌లో వస్తుంది. కేవలం 40 రోజుల్లోనే కొండపొలం సినిమా పూర్తిచేశాడు క్రిష్. ఒకవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే.. మరోవైపు వైష్ణవ్ తేజ్ సినిమా కూడా పూర్తి చేశాడు. ఈ సినిమాను దసరా బరి నుంచి తప్పించి.. నవంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. కేవలం అఖిల్ సినిమా కోసమే మెగాహీరో సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఇద్దరికీ నష్టం తప్పదు. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement