Friday, March 29, 2024

ఆసక్తికరంగా వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ట్రైలర్

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కొండపొలం’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై రాజీవ్‌ రెడ్డి, జె.సాయి బాబు ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

ఈ మూవీలో రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్‌, ఓబులమ్మగా రకుల్‌ ఆకట్టుకుంటున్నారు. ఈ జోడీ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement