Friday, March 29, 2024

వ్యాక్సిన్ వేసుకోకపోవడమే అతిపెద్ద వ్యాధి: జో బైడెన్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుండటంపై మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో టీకాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందేందుకు మార్గాలు ఉన్నాయే తప్ప, దానికి అడ్డుకట్ట వేసే మార్గాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ వంటి వాటిలో టీకాలపై జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. టీకాలు వేసుకోకపోవడమే ఇప్పుడు అతిపెద్ద వ్యాధిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై ఫేస్ బుక్ ప్రతినిధఇ డానీ లీవర్ ఖండించారు. కరోనాపై ఫేస్‌బుక్‌లో ఇచ్చిన అధికారిక సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారన్నారు. టీకా కేంద్రాల వివరాలను ఒక్క అమెరికాలోనే 30.3 లక్షల మంది పరిశీలించినట్టు తెలిపారు. ఫేస్‌బుక్ ప్రజల ప్రాణాలను కాపాడుతుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మ్యుటేషన్‌ చెందుతోందన్న అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని వివరించింది.

ఇది కూడా చదవండి :దేశంలో 40 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి: కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement