Thursday, April 25, 2024

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ పై సుప్రీంకోర్టులో కేసు వేసి స్టే తీసుకురావాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కృష్ణానదిపై ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేసి స్టే తీసుకురావాలని నల్గొండ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలా చేసినప్పుడే కేసీఆర్‌ రాష్ట్రానికి న్యాయం చేసినవారవుతారన్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో కొట్లాడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులను ప్రభుత్వం రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. వీటిని అనుమతి పొందిన ప్రాజెక్టులుగా గెజిట్‌లో నమోదు చేయలేదు. అందువల్ల వీటికి నిధుల సమీకరణ కష్టమవుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతుంది.

ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు వెడల్పు పనులు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఇప్పుడు హడావుడి చేస్తోంది. ఇప్పటిదాకా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర గెజిట్‌ వల్ల రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎడారి అవుతాయి’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: జగన్ లూటీలపై సీబీఐ చేసింది చాలా తక్కువ: రఘురామ

Advertisement

తాజా వార్తలు

Advertisement