Friday, April 19, 2024

పోలాండ్‌ పర్యటనకు బైడెన్‌…

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐరోపా పర్యటనకు వెళ్లనున్నారు. నాటో, ఐరోపా మిత్ర దేశాలతో అత్యవసర సమావేశాలను నిర్వహించనున్నారు. పోలాండ్‌ అధ్యక్షుడితో కూడా సమావేశం అవుతారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో బైడెన్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పర్యటనలో భాగంగా బైడెన్‌ మొదట బ్రస్సెల్స్‌ చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌తో భేటీ అవుతారు. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాలు అందిస్తున్న మానవతా సాయం గురించి చర్చించనున్నారు. అయితే ఉక్రెయిన్‌ను సందర్శించే ఆలోచన లేదని శ్వేతసౌధం వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement