Friday, April 19, 2024

UP: ఘోర రోడ్డు ప్రమాదం : ఎనిమిది మంది మృతి, న‌లుగురికి తీవ్ర‌గాయాలు

ఓ ఘోర రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జోగియా కొత్వాలి ప్రాంతంలోని నౌగర్ బన్నీ రోడ్డులో ఉన్న కాత్యా గ్రామ సమీపంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును… బొలేరో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కారు పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. చాలా వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొనగానే బొలెరో ఎగిరిపోయింది. ట్రక్కును ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే జోగియా కొత్వాలి పోలీసులకు తెలియజేశారు. ఆ వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, గ్రామస్థులు ఎలాగోలా అందరినీ బయటకు తీశారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో బొలెరోలో మొత్తం 11మంది ఉండగా.. వారిలో ఇద్దరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఒకరిని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయగా.. గాయపడిన వారిలో ఒకరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement